“రేయ్” తరువాతి షెడ్యూల్ మొదలుపెట్టనున్న వై వి ఎస్

“రేయ్” తరువాతి షెడ్యూల్ మొదలుపెట్టనున్న వై వి ఎస్

Published on Feb 11, 2012 9:55 PM IST

వై వి ఎస్ చౌదరి “రేయ్” చిత్ర తరువాతి షెడ్యూల్ మొదలు పెట్టబోతున్నారు. గత షెడ్యూల్ ని బ్యాంకాక్ లో డిసెంబర్ లో ముగించిన ఈ దర్శకుడు తన సమయం మొత్తం రవితేజ నటిస్తున “నిప్పు” కి కేటాయించాడు. నిప్పు చిత్రాన్ని ఈయనే నిర్మించగా గుణశేఖర్ దర్శకత్వం వహించారు. నిప్పు ఈనెల 17న విడుదల కానుండగా ఇప్పుడు వై వి ఎస్ “రేయ్” చిత్రం తరువాతి షెడ్యూల్ ని నిప్పు విడుదల తరువాత మొదలు పెట్టనున్నాడు. హైదరాబాద్ లో కొన్ని రోజులు చిత్రీకరణ జరుపుకున్న తరువాత వై వి ఎస్ అమెరికా లో మిగిలిన భాగం పూర్తి చెయ్యబోతున్నారు. చిరంజీవి మేనల్లుడు సాయి ధరం తేజ్ ఈ చిత్రం తో హీరో గా పరిచయం కానున్నారు.

తాజా వార్తలు