మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘విశ్వంభర’ ఇప్పటికే ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వశిష్ట మల్లిడి పూర్తి సోషియో ఫాంటసీ చిత్రంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. అయితే, తాజాగా ఈ చిత్రాన్ని గ్లోబల్ లెవెల్కు తీసుకెళ్లారు చిత్ర నిర్మాతలు.
ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ‘విశ్వంభర’ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు చిత్ర నిర్మాత విక్రమ్ కుమార్. ఈ సినిమాకు సంబంధించిన ఎపిక్ రివీల్ను ఆయన కేన్స్ స్టేజీపై చేయనున్నారు. ఈ మేరకు ఆయన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ రెడ్ కార్పెట్పై కనిపించారు. దీంతో ఒక్కసారిగా ‘విశ్వంభర’ మూవీ అంతర్జాతీయ స్థాయిలో సౌండ్ చేస్తుంది.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఎపిక్ రివీల్ ఏమిటనేది మనకు రేపు(మే 22) తెలుస్తుంది. ఈ సినిమాలో అందాల భామ త్రిష హీరోయిన్గా నటిస్తుండగా ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ అత్యంత భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.