సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్న మరో నార్త్ హీరోయిన్

సొంతంగా డబ్బింగ్ చెప్పుకోనున్న మరో నార్త్ హీరోయిన్

Published on Oct 28, 2012 2:30 PM IST


మన తెలుగు సినిమాలలో నార్త్ ఇండియన్ హీరోయిన్లు నటించడమే తప్ప సొంతంగా డబ్బింగ్ చెప్పుకోరు. కానీ ప్రస్తుతం కొంత మంది కథానాయికలు వారి సినిమాలకు సొంత డబ్బింగ్ చెప్పుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే నిత్యా మీనన్, తాప్సీ, సమంత మరియు నయనతార తమ సినిమాలకు డబ్బింగ్ చెబుతుండగా కొత్తగా వీరి జాబితాలో రిచా పనాయ్ వచ్చి చేరింది. ఈ భామ ఎవరా అనుకుంటున్నారా? ఈ అందాల భామ మన కామెడీ కింగ్ అల్లరి నరేష్ ‘యముడికి మొగుడు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. స్వతహాగా నార్త్ ఇండియన్ అయిన రిచా వ్రుత్తి పట్ల ఉన్న గౌరవంతో తన పాత్రకి సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే పలు మళయాళ సినిమాల్లో నటించిన రిచాకి ఇది మొదటి తెలుగు సినిమా. తెలుగు సరిగ్గా రాకపోయినా తన మొదటి సినిమాతో డబ్బింగ్ చెప్పడానికి ముందుకు వచ్చిన రిచాని మెచ్చుకొనే తీరాలి. ఈ సోషియో ఫాంటసీ సినిమాలో యమధర్మ రాజు కూతురి పాత్రలో రిచా కనిపించనుంది. యమధర్మ రాజు పాత్రలో సాయాజీ షిండే నటిస్తుండగా, అతని భార్య పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అల్లరి నరేష్ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమాతో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఇ. సత్తిబాబు దర్శకత్వం వహిస్తున్నారు మరియు చంటి అడ్డాల నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు