పూజ హెగ్డే కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉంది. ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన చేస్తూనే బాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంది. కాగా ఆమెకు సల్మాన్ ఖాన్ హీరోగా తెరక్కెక్కనున్న కబీ ఈద్ కబీ దివాలి చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఫర్హాద్ సామ్జి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా 2021లో రంజాన్ కానుకగా విడుదల కానుంది. ఈ మూవీ ఈ ఆగస్టు నుండి సెట్స్ పైకి వెళ్లాల్సివుంది. కాగా ఈ చిత్రంలో సల్మాన్ సరసన నటించే అవకాశం రావడం ఎలాంటి అనుభూతిని ఇస్తుంది అని అడుగగా ఆమె ఆసక్తికరంగా స్పందించారు.
పూజ మాట్లాడుతూ సల్మాన్ గారితో పనిచేయడం అనేది గొప్ప అవకాశం అయినప్పటికీ కొంచెం భయంగా కూడా ఉంది. అంత సీనియర్ నటుడితో పక్కన నటించే తప్పుడు చాల జాగ్రత్తగా, శ్రద్ధతో నటించాలి, అన్నారు. ఇక పూజ తెలుగులో ప్రభాస్ సరసన పీరియడ్ లవ్ డ్రామాలో నటిస్తుంది. అలాగే అక్కినేని అఖిల్ కి హీరోయిన్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో కూడా పూజ హెగ్డే చేస్తుంది.