టాలీవుడ్లో తెరకెక్కిన ప్రెస్టీజియస్ చిత్రాల్లో ‘కుబేర’ కూడా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న వంటి స్టార్స్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
అయితే, ఈ చిత్ర రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్పై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. జూన్ 13న జరగనున్న ‘కుబేర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఈ చిత్ర ట్రైలర్ను లాంచ్ చేస్తున్నట్లు వారు తాజాగా ప్రకటించారు. ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్తో వారు ఈ అనౌన్స్మెంట్ చేయడంతో అభిమానుల్లో ఈ ట్రైలర్పై మరింత ఆసక్తి పెరిగింది.
ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ 20న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.