Kuberaa : అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంతాపంగా ‘కుబేర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా

Kuberaa : అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంతాపంగా ‘కుబేర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా

Published on Jun 12, 2025 10:00 PM IST

టాలీవుడ్‌లో తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’ ప్రస్తుతం హాట్ ఫేవరెట్‌గా ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండగా అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్ర గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను జూన్ 13న హైదరాబాద్‌లో ప్లాన్ చేశారు. ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ట్రైలర్ లాంచ్ కూడా చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ, నేడు జరిగిన అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. 240 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ విషాదకర ఘటనపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఈ ప్రమాదానికి సంతాపం తెలుపుతూ ‘కుబేర’ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఇలాంటి విషాదకర సమయంలో తాము ఈవెంట్ పెట్టడం సరికాదని భావించి కుబేర మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించిన తదుపరి అప్డేట్ త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు