‘కుబేర’ మూవీని ఓకే చేసేందుకు ధనుష్ ఎంత టైమ్ తీసుకున్నాడో చెప్పిన నిర్మాతలు!

‘కుబేర’ మూవీని ఓకే చేసేందుకు ధనుష్ ఎంత టైమ్ తీసుకున్నాడో చెప్పిన నిర్మాతలు!

Published on Jun 12, 2025 8:59 PM IST

టాలీవుడ్ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, తమిళ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ శరవేగంగా నిర్వహిస్తోంది.

అయితే, ఈచిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ ఈ సినిమాపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెరకెక్కిన ‘లవ్‌స్టోరి’ చిత్రం సమయంలోనే శేఖర్ కమ్ముల తమకు ఈ చిత్ర పాయింట్ చెప్పాడని.. ఆ తర్వాత ఈ సినిమాలో ధనుష్ అయితేనే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడని ఆయన అనుకుని ధనుష్‌కు కథను వివరించాడన.. ఇక ధనుష్ కేవలం 20 నిమిషాల్లో ఈ సినిమాను ఓకే చేశాడని వారు తెలిపారు.

శేఖర్ కమ్ముల సినిమా కోసం స్టార్స్‌లో సెలబ్రిటీలను కాకుండా వారు చేయబోయే పాత్రలను వెతుకుతాడని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని జూన్ 20న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు