‘మిత్ర మండలి’ వారి నుంచి ఆగమనం.. ఎప్పుడంటే..?

‘మిత్ర మండలి’ వారి నుంచి ఆగమనం.. ఎప్పుడంటే..?

Published on Jun 11, 2025 4:00 PM IST

టాలీవుడ్‌లో కామెడీ జోనర్ చిత్రాలకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రంగా ‘మిత్ర మండలి’ అనే మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను విజయేందర్ ఎస్. డైరెక్ట్ చేస్తుండగా బన్నీ వాస్ ఈ చిత్రాన్ని సమర్పి్స్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది.

ఇక ఇప్పుడు ఈ మిత్ర మండలి వారు ప్రేక్షకులను అలరించేందుకు సరికొత్త టీజర్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా టీజర్‌ను జూన్ 12న మధ్యాహ్నం 12 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వారు అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ ఫుల్‌టూ ఎంటర్‌టైనర్ మూవీ ఎలాంటి కామెడీని పండిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమాలో ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా ఫీమేల్ లీడ్‌గా నిహారిక ఎన్ఎమ్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. మరి ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు