ఎయిర్ ఇండియా విమానం క్రాష్.. పవన్ కళ్యాణ్ సహా సినీ ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి

ఎయిర్ ఇండియా విమానం క్రాష్.. పవన్ కళ్యాణ్ సహా సినీ ప్రముఖుల తీవ్ర దిగ్భ్రాంతి

Published on Jun 12, 2025 5:02 PM IST

గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో తాజాగా చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాద సమయంలో ఎయిర్ ఇండియా విమానంలో దాదాపు 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి భారీ విమాన ప్రమాదం చోటు చేసుకోవడంతో ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆయా ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ విమాన ప్రమాదం గురించి తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదిక తమ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ ఈ విమాన ప్రమాదంపై తన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి వార్త వినడం చాలా విషాదకరమని.. ప్రయాణికుల కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన కోరారు.

పవన్‌తో పాటు వరుణ్ తేజ్, థమన్, గోపీచంద్ మలినేని, తేజా సజ్జా, అడివి శేష్, శర్వానంద్ వంటి స్టార్స్ కూడా తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు