దాదాపు టాలీవుడ్ లో ఒకేసారి కెరీర్ ప్రారంభించారు హీరోయిన్ కాజల్ మరియు తమన్నా. 2004లో వచ్చిన ఓ హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయమైన కాజల్ అగర్వాల్ 2007లో తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా విడుదలైన లక్ష్మీ కళ్యాణం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక మిల్కీ బ్యూటీ తమన్నా 2005లో హిందీ చిత్రంతో వెండితెరకు పరిచయమై, అదే ఏడాది తెలుగులో మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. స్టార్ హీరోయిన్స్ గా అందరు టాప్ హీరోలతో ఆడిపాడారు వీరిద్దరూ. తమన్నా, కాజల్ హీరోయిన్స్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టి దాదాపు 15ఏళ్ళు అవుతున్నా.. ఇంకా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు వెళుతున్నారు.
కాజల్ ప్రస్తుతం తెలుగులో రెండు భారీ చిత్రాలు చేస్తుంది. చిరంజీవి 152వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో తెరక్కెక్కుతున్న ఆచార్య మూవీలో కాజల్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే మంచు విష్ణు హీరోగా తెరక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ మోసగాళ్లు మూవీలో కూడా ఆమె హీరోయిన్. వీటితో పాటు కమల్ హీరోగా తెరక్కుతున్న భారతీయడు 2 సినిమాలో కూడా కాజల్ హీరోయిన్ కావడం విశేషం. ఇక తమన్నా తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటీమార్ చిత్రంలో లేడీ కబడ్డీ కోచ్ పాత్ర చేస్తుంది. అలాగే దట్ ఈజ్ మహాలక్ష్మీ అనే చిత్రంతో పాటు, ఓ హిందీ చిత్రంలో కూడా నటిస్తుంది. కాజల్,తమన్నాలతో పాటు పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్స్ కనుమరుగైపోగా, వీరిద్దరూ ఇంకా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు.