సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రాబోతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో విలన్ గా కన్నడ హీరో ఉపేంద్ర అయితే బాగుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ఉపేంద్ర సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ షేడ్స్ పాత్ర పోషించినా అది విలన్ పాత్ర అయితే కాదు. మరి కన్నడ నాట స్టార్ హీరోగా కొనసాగుతున్న ఉపేంద్ర, మహేష్ సినిమాలో విలన్ గా చేయడానికి అంగీకరిస్తాడా లేదా అనేది చూడాలి.
ఇక ఈ సినిమాలో కథానాయకురాలిగా కీర్తి సురేష్ నటించబోతుందని ఇటివలే వార్తలు వచ్చాయి. ఆ తరువాత మళ్ళీ కియారా అద్వానీని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని రూమర్స్ వినిపించాయి. కీర్తి, కియారాలో, సూపర్ స్టార్ పక్కన ఎవరు రొమాన్స్ చేయనున్నారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని నమోదు చేశాక కూడా పరుశురామ్ తన తరువాత సినిమా కోసం చాల టైం తీసుకున్నాడు. అయితే అంత టైం తీసుకున్నందుకు పరుశురామ్ కి భారీ ఆఫరే దక్కింది.
మహేష్ – పరుశురామ్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో కూడా మంచి ఆసక్తి ఏర్పడింది. అన్ని కుదిరితే అక్టోబర్ నుండి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు.