కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “కుబేర” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి ఇది వరకే వచ్చిన గ్లింప్స్ ఇంకా పాటలు ఆడియెన్స్ కి ఆకట్టుకున్నాయి. అయితే తమ సినిమా ట్రాన్స్ లోకి తీసుకెళ్లేందుకు ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ ని మేకర్స్ ఇపుడు విడుదల చేశారు.
అయితే ఇందులో దాదాపు అన్ని పాత్రలని చూపించి వాటి స్వభావాలు రివీల్ చేశారు. మెయిన్ గా ధనుష్ ఇంకా కింగ్ నాగార్జున నడుమ డ్రామా హైలైట్ అయ్యేలా కనిపిస్తుంది. వీటితో పాటుగా డబ్బు ప్రధాన అంశంగా కనిపిస్తుంది. ఇంకా శేఖర్ కమ్ముల మార్క్ నాచురల్ టేకింగ్ ధనుష్ అద్భుతమైన నటన మరింత ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు.
ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం దేవిశ్రీ ప్రసాద్ సాలిడ్ బీట్స్ తో ఈ టీజర్ మంచి ఆసక్తిగా ఉంది. రష్మిక మందన్నా పాత్రకి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక ఫైనల్ గా తనని కింగ్ చేసిన నాగార్జున పాత్రనే ధనుష్ కొట్టడానికి రావడం ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ గా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చే ట్రైలర్ తో మరిన్ని డీటెయిల్స్ బయటకి రావచ్చు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి