సీఎం జగన్ మీటింగ్ లో చర్చించిన కీలక అంశాలివే.


చిరంజీవి, నాగార్జున వంటివారితో కూడిన టాలీవుడ్ ప్రముఖులు నేడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ఈ మీటింగ్ లో సీఎం జగన్ తో పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తుంది. జగన్ తో భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా తెలంగాణాలో వలె జూన్ 15నుండి ఆంధ్రప్రదేశ్ లో సైతం షూటింగ్స్ నిర్వహించుకునేలా అనుమతులు ఇవ్వడం జరిగింది.

ప్రభుత్వ అవార్డుల వేడుకల నిర్వహణ, ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. ఇక ఫిక్స్డ్ టికెట్ ప్రైసింగ్ విధానంపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు చిరంజీవి తెలిపారు. గంటకు పైగా జరిగిన ఈ మీటింగ్ లో టాలీవుడ్ అభివృద్ధి విషయంలో అన్ని రకాలుగా సహకారం అందిస్తామని వై ఎస్ జగన్ చెప్పారని తెలుస్తుంది.

Exit mobile version