బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఇటీవల ఓటీటీ ప్లాట్ఫామ్లు అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. సినిమాలు రిలీజ్ అయ్యాక తక్కువ సమయంలో ఓటీటీలోకి తీసుకొస్తే, థియేటర్లు నష్టపోతాయని.. ఇది ఏమాత్రం అంగీకరించే విషయం కాదని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ చేశారు. దీంతో ఇప్పుడు అందరి చూపులు ఆయన సొంత బ్యానర్ నుంచి వస్తున్న ‘సితారే జమీన్ పర్’పై పడ్డాయి.
ఫీల్ గుడ్ కంటెంట్గా ఈ సినిమాను ఆయన ప్రమోట్ చేస్తున్నారు. ప్రతి ఆర్ఎస్.ప్రసన్న డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ సొంతంగా ప్రొడ్యూస్ చేశారు. ఇక ఈ సినిమాలో ఆయన కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది. ‘తారే జమీన్ పర్’ వంటి బ్లాక్బస్టర్ చిత్రం తర్వాత అలాంటి కథతోనే ఈ సినిమాను కూడా తీసుకొస్తున్నాడు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ రైట్స్ను అమీర్ ఖాన్ అమ్మలేదు.
సినిమా థియేట్రికల్ రన్ ముగిశాక, తానే స్వయంగా యూట్యూబ్లో పే పర్ వ్యూ పద్ధతిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తానని అమీర్ చెప్పుకొచ్చాడు. అయితే, సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అయితే ఓకే.. కానీ, ఏదైనా తేడా కొడితే, ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో డబ్బులు పెట్టి ఎందుకు చూస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంలో అమీర్ ఖాన్ ప్లాన్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.