టాలీవుడ్ దర్శకడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కుబేర’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు రెడీ అయింది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ చేశాయి.
ఇక ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని ప్రీ-క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలోని ఎమోషన్స్ను ఈ ప్రీ-క్లైమాక్స్లో నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లనున్నారట.
అటు ఈ సినిమాలో ధనుష్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఈ సినిమాలో ధనుష్ హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.