‘కేస్-30’ చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన సుధీర్ బాబు..!

యంగ్ టాలెంటెడ్ సందీప్ పైడిమర్రి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కథాచిత్రం ‘కేస్-30’. పి.ఎన్. ఆర్.ఫిల్మ్ ఫ్యాక్టరీ-యువసాయి క్రియేషన్స్ బ్యానర్స్‌పై పి.నరసింహారావు మరియు బోడా రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్ద్ నాయుడు, శ్వేతాగర్గ్, తేజస్విని రావెళ్ల, ‘రంగస్థలం’ మహేష్ ముఖ్య తారాగణంగా ఉన్నారు.

అయితే ఇటీవల ఈ చిత్ర బృందం యంగ్ హీరో సుధీర్ బాబును కలిసి ఆయన అభినందనలు అందుకుంది. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ‘కేస్-30’ ఖచ్చితంగా మంచి విజయం సాధించాలని సుధీర్ బాబు ఆకాక్షించారు. అయితే ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకొని లాక్ డౌన్ కారణంగా ఆగిన ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మళ్లీ మొదలు కానుంది. అయితే ‘కేస్-30’ అందరికీ చాలా మంచి పేరు తీసుకువస్తుందని డైరెక్టర్ సందీప్ పైడిమర్రి ఆశాభావం వ్యక్తం చేస్తూ నిర్మాతలు పి.నరసింహారావు, బోడా రాధాకృష్ణలకు కృతఙ్ఞతలు తెలిపారు.

Exit mobile version