తెలుగు ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రలను చేస్తోన్న హీరోల్లో శర్వానంద్ పేరే ముందువరుసలో ఉంటుంది. కానీ ఈ మధ్య శర్వానంద్ కి సాలిడ్ హిట్ చాలా కాలం అయిపోయింది. ప్రస్తుతం వరుస ప్లాప్ లతో శర్వానంద్ సతమతమవుతున్నాడు. అయితే శర్వా కొత్త సినిమాలను లైన్ లో పెట్టాడట. కరోనా ఎఫెక్ట్ తగ్గాక సెట్స్ మీదకు వెళ్లేలా ఇప్పటికే ప్లాన్ కూడా చేశాడట. మే ఎండింగ్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నాడు. అయితే అది తెలుగు డైరెక్టర్ తో కాదు.. డైరెక్ట్ తమిళ చిత్రం చెయ్యబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ కొరియోగ్రఫర్ రాజు సుందరం డైరెక్ట్ చేయనున్నాడు. కొన్నిరోజులుగా చర్చల దశలోనే ఉన్న ఈ చిత్రం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
కాగా ఈ సినిమా తమిళంతో పాటు ఒకేసారి తెలుగులో కూడా తెరకెక్కనుంది. మరి తెలుగులో హిట్ వచ్చి చాల కాలం అయిన శర్వానంద్ కి తమిళంలో అయినా హిట్ వస్తోందా..? ఇప్పటికే గతంలో 2011లో వచ్చిన తమిళ్ సినిమా ‘ఎంగేయుమ్ ఇప్పోతుమ్’ (తెలుగులో జర్నీ)లో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించాడు. మళ్లీ దాదాపు ఎనిమిది సంవత్సరాల తరువాత ఇప్పుడు నటించబోతున్నాడు. ఫేమస్ కొరియోగ్రఫర్ మొదటిసారి డైరెక్షన్ చేస్తుండటంతో ఈ సినిమా పై తమిళ ప్రేక్షకుల్లో కూడా బాగానే ఆసక్తి ఉంది. మరి రాజు సుందరం శర్వానంద్ కి హిట్ ఇస్తాడో లేదో చూడాలి. ఎలాగూ గత చిత్రాలు రణరంగం, జాను బాక్సాఫీస్ వద్ద ప్లాప్ గా నిలవడంతో శర్వా కెరీర్ కి ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు చాల కీలకంగా మారాయి.