టాలీవుడ్లో ప్రస్తుతం రీ-రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతోంది. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేసిన సినిమాలను తిరిగి రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ రీ-రిలీజ్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ కడా లభిస్తుంది. అయితే, చాలా మంది తెలుగు ప్రేక్షకులు కోరుకున్న ఓ క్లాసిక్ చిత్రాన్ని ఇప్పుడు రీ-రిలీజ్ చేస్తు్న్నట్లు మేకర్స్ వెల్లడించారు.
స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించిన క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అప్పట్లోనే బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్గా నిలిచింది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో ఈ మూవీకి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కింది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ మూవీకి ఫ్యామిలీ ఆడియెన్స్ పట్టం కట్టారు.
ఇక ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మార్చి 7న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాన్ని గ్రాండ్ రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ క్లాసిక్ మూవీని మరోసారి థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో సమంత, అంజలి హీరోయిన్లుగా నటించారు.