కాకినాడ తాలూకా నేపథ్యంతో రఘుకుంచే నటించిన “గేదెల రాజు” ఫస్ట్‌లుక్

కాకినాడ తాలూకా నేపథ్యంతో రఘుకుంచే నటించిన “గేదెల రాజు” ఫస్ట్‌లుక్

Published on Jun 13, 2025 2:07 PM IST

సంగీత దర్శకుడు, నటుడు, సింగర్ రఘు కుంచే ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గేదెల రాజు’ ఫస్ట్‌లుక్‌ను రఘు కుంచే జన్మదినం సందర్భంగా శుక్రవారం విడుదల చేశారు. ఈ చిత్రం కాకినాడ తాలూకా నేపథ్యంతో రూపొందుతోంది.

ఫస్ట్‌లుక్‌లో రఘు కుంచే ఫెరోసియష్‌ లుక్‌లో కనిపించి, “చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు” అనే సందేశాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. మోటూరి టాకీస్ పతాకంపై రఘు కుంచే సమర్పిస్తున్న ఈ చిత్రానికి చైతన్య మోటూరి దర్శకత్వం వహిస్తున్నారు.

చిత్రంలో రవిఆనంద్ చిన్నిబిల్లి, రామచంద్రం, శ్రావ్య, వికాశ్, మౌనిక తదితరులు నటించారు. సహ నిర్మాతలుగా రవిఆనంద్ చిన్నిబిల్లి, తాడాల వీరభద్రరావు, గీతార్థ్ కుంచే ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌లు కిరణ్ తాతపూడి, దివ్య మోటూరి. పబ్లిసిటి డిజైనర్ ఏజే ఆర్ట్స్ అజయ్, విఎఫ్‌ఎక్స్ కొత్తపల్లి సునీల్, లిరిక్స్ గిరిధర్ రాగోలు, లలిత కాంతారావు, ఎడిటర్ సుధీర్ ఎడ్ల, కాస్ట్యూమ్ డిజైనర్ సింధూ ధిలీషా, పిఆర్‌ఓ శివ మల్లాల, మూర్తి మల్లాల, ఆర్ట్ అమర్ తలారి, చీఫ్ అసోసియేట్ గౌరి శంకర్ కో డైరెక్టర్ శేఖర్ కుంపట్ల.

సంగీతం కూడా రఘు కుంచే స్వయంగా సమకూర్చారు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం చైతన్య మోటూరి చేతుల మీదుగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది.

ఈ ఫస్ట్‌లుక్ విడుదలతో ‘గేదెల రాజు’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు