చరణ్ సరసన నృత్యం చెయ్యనున్న శ్వేతా భరద్వాజ్

“బిజినెస్ మాన్” చిత్రంతో యువత మనసులను కొల్లగొట్టిన ఐటెం గర్ల్ శ్వేత భరద్వాజ్ ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ సరసన “ఎవడు” చిత్రం కోసం ఒక పాటలో నృత్యం చేయ్యనుంది. ఈ అవకాశం శ్వేత వద్దకు వెళ్ళింది ఇంకా అధికారికంగా ఒప్పుకోలేదు. ఆకట్టుకునే అందానికి డాన్స్ తోడయ్యి ఐటెం సాంగ్స్ లో అద్బుతమయిన హావ భావాలను పలికిస్తున్న శ్వేతా తెలుగులో మంచి ఐటెం గర్ల్ గా పేరు తెచ్చుకుంది.. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. సమంత మరియు ఏమి జాక్సన్ లు ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈసారి శ్వేతా ఎటువంటి ప్రదర్శనతో మన ముందుకి వస్తుందో వేచి చూడాలి.

Exit mobile version