‘సూపర్ మచ్చి’ చూసిన మెగా ఫ్యామిలీ !


కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా లాక్‌ డౌన్‌ లోనే ఈ సినిమా షూటింగ్ ను రామానాయుడు స్టూడియోస్‌లో మొదలు పెట్టి పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీతో రెడీగా ఉంది. కాగా మెగాస్టార్ ఫ్యామిలీ కూడా రీసెంట్ గా ఈ సినిమాని స్పెషల్ షో వేయించుకుని చూసారట.

సినిమాలో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉందని మెగాస్టార్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇక కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నే ప్రయత్నం చేశాడు. అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కళ్యాణ్ దేవ్ మాత్రం నటనలో మంచి ప్రతిభను కనబరిచాడు. మరి ‘కళ్యాణ్ దేవ్’ ప్రస్తుతం పులి వాసు దర్శకత్వంలో చేస్తోన్న ఈ సినిమాతోనైనా హిట్ అందుకుంటాడేమో చూడాలి. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

Exit mobile version