భారీ ప్రాజెక్ట్ దర్శకనిర్మాతగా స్టార్ హీరోయిన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఓ భారీ ప్రాజెక్ట్ చేపట్టనుంది. ఆమె ఏకంగా ఓ పౌరాణిక చిత్ర దర్శక నిర్మాత బాధ్యతలు తీసుకోనుంది. స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ అపరంజిత అయోధ్య అనే ఓ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఆ మూవీని స్వయంగా నిర్మించాలని కంగనా రనౌత్ భావిస్తున్నారు. ఐతే దర్శకుడి కోసం వెతికిన కంగనా చివరకు తానే ఆ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్ణయం తీసుకుందట. మరి ఈ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారని సమాచారం.

గతంలో మణికర్ణిక మూవీ దర్శకత్వ బాధ్యతలు కంగనా నిర్వహించిన సంగతి తెలిసిందే. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కోసం మధ్యలో ఈ ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోగా, కంగనా దర్శకత్వం వహించారు. ప్రస్తుతం కంగనా జయలలిత బయోపిక్ తలైవి మూవీలో నటిస్తుంది. కే ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా పలు భాషలలో విడుదల కానుంది.

Exit mobile version