హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ యావత్ ఇండియన్ సినిమా మేకర్స్కు ఓ డ్రీమ్ ప్లేస్. ఇక్కడ తమ సినిమాల షూటింగ్ జరుపుకోవాలని దర్శకనిర్మాతలు కోరుకుంటారు. ఇలాంటి ఫిలిం సిటీపై బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఇటీవల కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేసింది.
రామోజీ ఫిలిం సిటీలో రాత్రి పూట ఉండాలంటే తనకు చాలా భయంగా ఉండేదని.. అక్కడ ఏదో భయంకరమైన శక్తులు ఉన్నాయని ఆమె ఇటీవల కొన్ని కామెంట్స్ చేసింది. దీంతో కాజోల్పై తెలుగు ప్రేక్షకులు ఫైర్ అయ్యారు. అంతేగాక, పలువురు ఫిల్మ్ మేకర్స్ కూడా ఆమె కామెంట్స్ను తప్పుబట్టారు. రామోజీ ఫిలిం సిటీలో చాలా సినిమాలు షూటింగ్ జరుపుకున్నా, ఎవరూ ఇలాంటి కామెంట్స్ చేయలేదు. అయితే, తాజాగా తాను చేసిన కామెంట్స్పై కాజోల్ వివరణ ఇచ్చింది.
తాను చేసిన కామెంట్స్ తన లేటెస్ట్ సినిమా ‘మా’ ప్రమోషన్స్లో భాగంగా అన్నానని.. అయితే, రామోజీ ఫిలిం సిటీలో తాను కొన్నేళ్లుగా సినిమా షూటింగ్స్ చేశానని.. అక్కడి ప్రొఫెషనల్ వాతావరణం అందరికీ నచ్చుతుందని.. ముఖ్యంగా టూరిస్టులు అక్కడ చాలా ఎంజాయ్ చేస్తారని.. ఫ్యామిలీస్, పిల్లలు అక్కడ ఉండటంలో ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె తన కామెంట్స్పై స్పందించింది.