వేశ్యల పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

వేశ్యల పై హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

Published on Jun 23, 2025 10:00 PM IST

‘1000 అబద్దాలు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ఎస్తేర్ నొరోన్హా. ఆ తర్వాత భీమవరం బుల్లోడు, జయ జానకి నాయక వంటి చిత్రాల్లో ఎస్తేర్ నొరోన్హా నటించింది, అయినా ఆమెకి పెద్దగా గుర్తింపు రాలేదు. అవకాశాలూ రాలేదు. ప్రస్తుతం చిన్న చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఐతే, తాజాగా ది వేకెంట్ హౌస్ అనే సినిమాకు దర్శకత్వంతో పాటు నిర్మాతగానూ వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎస్తేర్ వేశ్యల గురించి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఇంతకీ, ఎస్తేర్ నొరోన్హా ఏం మాట్లాడింది అంటే.. ‘సమాజంలో వేశ్యలను చాలామంది చులకనగా చూస్తారు. ‘నిజంగా మగాళ్లకు వేశ్యల పట్ల సానుభూతి లేదు. ఉంటే.. వారి దగ్గర వెళ్లి.. కోరిక తీర్చుకోకుండా డబ్బులు ఇచ్చి రావాలి. కానీ, ఎవరూ అలా చేయరు. సమాజంలో వేశ్యలున్నారంటే.. వారిని వాడుకునే వారూ ఉన్నారనే అర్థం. నిజంగా మగాళ్లంతా పవిత్రంగా ఉంటే.. ఈ లోకంలో వేశ్యలు ఉండేవారు కాదేమో’ అని ఎస్తేర్ నొరోన్హా చెప్పుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు