అనురాగ్ తెలుగు ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతాడా..?

బాలీవుడ్‌లో దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన సినిమాలకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఆయన నుంచి వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్’ వంటి చిత్రాలకు ప్రేక్షకుల నుంచి సాలిడ్ ఆదరణ దక్కింది. ఇక ఈ డైరెక్టర్ యాక్టంగ్ కూడా చేస్తూ బిజీగా ఉన్నాడు. కేవలం బాలీవుడ్‌లోనే కాకుండా సౌత్ ఇండియా చిత్రాల్లోనూ అనురాగ్ తన సత్తా చాటుతున్నాడు.

గతంలో విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ చిత్రంలో విలన్‌గా అనురాగ్ కశ్యప్ ఔట్‌స్టాండింగ్ పర్ఫార్మన్స్ చేశారు. ఈ సినిమా విజయంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు తెలుుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు ఈ వెర్సటైల్ యాక్టర్ కమ్ డైరెక్టర్. యంగ్ హీరో అడివి శేష్ నటిస్తున్న ‘డకాయిట్’ మూవీలో ఇన్‌స్పెక్టర్ స్వామి అనే పాత్రలో అనురాగ్ నటిస్తున్నాడు. ఈ సినిమాతో తెలుగునాట ఎంట్రీ ఇస్తున్నాడు ఈ డైరెక్టర్.

మరి అనురాగ్ కశ్యప్‌కి తెలులు ఆడియన్స్ ఎలాంటి ట్రీట్ ఇస్తారా.. అయన తెలుగు ప్రేక్షకులు ఎంతమేర కనెక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version