ప్రస్తుతం యావత్ భారతదేశ ప్రజలు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా వైపు చూస్తున్నారు. అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఎలా జరుగుతున్నాయో అని అందరూ ఆరా తీస్తున్నారు. అయితే, సామాన్య ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ పుణ్యస్నానాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఈ మహా కుంభమేళాలో పాల్గొన్నాడు.
ఆయన ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహా కుంభమేళాలో పాల్గొనడం జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి అని.. మన దేశ సంప్రదాయాలు, మన మూలాలను గుర్తుంచుకునేలా ఈ మహా కుంభమేళా లో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు. తన తల్లితో పాటు ఆయన ఈ మహా కుంభమేళాలో పాల్గొన్నారు. అయితే, దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇక ప్రయాగ్రాజ్లో పుణ్యస్నానం ఆచరించిన విజయ్ దేవరకొండ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీని కూడా సందర్శించారు. ఈ క్రమంలో ఆయన వెంట టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలో కనిపించారు. ప్రస్తుతం ఆయన పెట్టిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
The 2025 Kumbhmela – A journey to connect, pay respect to our epic origins and roots ❤️
Making memories With my Indian boys 🙂
Saying Prayers with mummy dearest.
A trip to Kasi with this darling gang. pic.twitter.com/m4uMcsYH1v
— Vijay Deverakonda (@TheDeverakonda) February 17, 2025