టాలీవుడ్లో ఘట్టమనేని వారసుల కోసం అభిమానులు ఎంత ఆసక్తిగా చూస్తారో అందరికీ తెలిసిందే. దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా త్వరలో సినీ రంగంలో అడుగుపెట్టనున్నాడు. అయితే ఆ సినిమాను ఎవరు తెరకెక్కి్స్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఈ సినిమాపై సినీ వర్గాలతో పాటు అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
అయితే, ఇప్పుడు ఈ హీరోను లాంచ్ చేసేందుకు ఓ డైరెక్టర్ దొరికినట్లుగా తెలుస్తోంది. ఆర్ఎక్స్ 100 మూవీతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ అందుకుని.. మంగళవారం సినిమాతో సాలిడ్ బజ్ క్రియేట్ చేసిన అజయ్ భూపతి ఇప్పుడు ఘట్టమనేని హీరోను ఇంట్రొడ్యూస్ చేసేందుకు సిద్ధమయ్యాడట.
ఇప్పటికే ఆయన మంగళవారం-2 చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఘట్టమనేని వారసుడి గ్రాండ ఎంట్రీ కానుండటంతో ఈ మూవీపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి జయకృష్ణను అజయ్ భూపతి ఎలా చూపెడతాడు అనేది ఆసక్తికరంగా మారింది.