జాతిరత్నాలు కోసం డబ్బింగ్ మొదలెట్టాడట !

జాతిరత్నాలు కోసం డబ్బింగ్ మొదలెట్టాడట !

Published on Jun 14, 2020 11:03 PM IST

టాలెంటెడ్ యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో వెండితెర పై ఎంట్రీ ఇవ్వ‌డమే కాకుండా, తొలి ప్ర‌య‌త్నంలోనే మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఆ సినిమాలో అతడి కామెడీ టైమింగ్‌కి చాలామంది ఫిదా అయిపోయి ఫ్యాన్స్‌గా మారిపోయారు. ముఖ్యంగా యూత్‌లో న‌వీన్ కి క్రేజ్ అమాతం పెరిగిపోయింది. అదే క్రేజ్ తో అతను లేటెస్ట్‌గా జాతిరత్నాలు అనే కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమా చేశాడు. లాక్‌డౌన్ త‌ర్వాత ఈ సినిమా థియేటర్స్‌కి రానుంది.

కాగా ప్రస్తుతం జాతిరత్నాలు సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడట ఈ యంగ్ హీరో. సినిమా అవుట్ ఫుట్ చాల బాగా వచ్చిందట. ఇక ఇటీవలే బాల‌య్య బోయ‌పాటి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న హ్యాట్రిక్ చిత్రంలో న‌వీన్ ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న‌ట్లు వార్తలు రావడం, వాటి పై నవీన్ స్పందిస్తూ.. ‘ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేద‌ని.. అదంతా కేవలం పుకారు మాత్రమే అని క్లారిటీ ఇచ్చేశాడు. ఏమైనా జాతిరత్నాలు గాని హిట్ నవీన్ రేంజ్ మారిపోతుంది. హీరోగా అతనికి ఫుల్ డిమాండ్ పెరుగుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు