సూర్య ‘రెట్రో’ మూవీని తెలుగులో రిలీజ్ చేసేది వీరే!

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు చేశాయి.

ఈ సినిమాను తెలుగులోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. కాగా, ఈ సినిమాను తెలుగులో ఎవరు రిలీజ్ చేస్తారా అనే ప్రశ్నకు తాజాగా సమాధానం లభించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్ర తెలుగు రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిపారు.

దీంతో ఈ సినిమాను తెలుగులో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని మే 1న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. మరి రెట్రో చిత్రానికి తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సాలిడ్ రెస్పాన్స్ అందిస్తారో చూడాలి.

Exit mobile version