‘అర్జున్ రెడ్డి’ వంటి కల్ట్ చిత్రంతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇక బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్తో ‘యానిమల్’ చిత్రంతో బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు ఈ క్రేజీ డైరెక్టర్. అయితే, ‘యానిమల్’ చిత్రం రిలీజ్ సమయంలో బాలీవుడ్ ప్రముఖుల నుంచి వచ్చిన విమర్శలు, వారి తీరుపై సందీప్ రెడ్డి వంగా తాజాగా స్పందించారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ వక్రబుద్ధిని బట్టబయలు చేశారు. ‘యానిమల్’ సినిమాను చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు సినిమాలో హింస ఎక్కువగా ఉందని.. స్త్రీలను తక్కువ చేసి చూపించారని విమర్శలు గుప్పించారు. అయితే, హీరో రణ్బీర్ కపూర్ని మాత్రం వారు పొగడ్తలతో ముంచెత్తారిన సందీప్ తెలిపారు. రణ్బీర్ చాలా తెలివైన వాడని.. అందుకే ఇలాంటి కథను ఎంచుకున్నాడని హీరోపై ప్రశంసలు కురిపించారట.
అయితే, ఈ విషయంలో హీరోను మెచ్చుకోవడంలో తనకు ఎలాంటి బాధ కలగలేదని.. అయితే, సినిమా రచయిత, దర్శకుడిపై మాత్రం విమర్శలు ఎందుకు చేశారు.. అంటూ ఆయనకు అర్థం కాలేదని సందీప్ అన్నారు. రణ్బీర్తో సినిమా చేసేందుకు బాలీవుడ్ వారు ఇలా అని ఉండొచ్చని.. అయితే, తాను కొత్త దర్శకుడిని కాబట్టి తనపై విమర్శలు చేయడం సులువు అనుకొని అలాంటి కామెంట్స్ చేసి ఉంటారని సందీప్ రెడ్డి వంగా తెలిపారు. ఇలా బాలీవుడ్ వక్ర బుద్ధిని సందీప్ రెడ్డి వంగా తాజాగా బట్టబయలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
ఇక యానిమల్ చిత్రానికి సీక్వెల్గా మరో రెండు భాగాలను ప్లాన్ చేస్తున్నానని.. ఇప్పటికే ‘యానిమల్ పార్క్’ కథ రెడీగా ఉందని.. ఇందులో రణ్బీర్ కపూర్ డ్యుయల్ రోల్లో నటిస్తాడని.. హీరోగా, విలన్గా రణ్బీర్ కనిపిస్తాడని సందీప్ రెడ్డి తెలిపారు.