సామాజిక సేవలో తనకు సాటిలేదని నిరూపించుకుంటున్నారు హీరో కమ్ డైరెక్టర్ కమ్ కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న అనేక మందికి ఆర్థికంగా ఆయన సహాయం చేయడం జరిగింది. అలాగే అనేక ఛారిటీ సంస్థలకు ప్రభుత్వాలకు ఆయన విరాళాలు అందించారు.కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన 37 కూలీలు తమిళ నాడులో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వారిని సొంత ప్రాంతాలకు చేర్చే ఏర్పాట్లు చేయవలసిందిగా తమిళనాడు సీఎం ని లారెన్స్ కోరారు.
లారెన్స్ అభ్యర్ధనను మన్నించి తమిళనాడు ప్రభుత్వం వారిని స్వస్థలాలకు చేర్చడం జరిగింది. ఇందుకు రాఘవ లారెన్స్ నేడు తమిళనాడు ముఖ్య మంత్రి పళని స్వామిని స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం రాఘవ లారెన్స్ అక్షయ్ కుమార్ హీరోగా లక్ష్మీ బాంబ్ అనే హిందీ మూవీ చేస్తున్నారు. కాంచన మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.