ఫోటో మూమెంట్ : ‘పెదరాయుడుతో పాపా రాయుడు’.. 30 ఏళ్ల సెలబ్రేషన్స్!

ఫోటో మూమెంట్ : ‘పెదరాయుడుతో పాపా రాయుడు’.. 30 ఏళ్ల సెలబ్రేషన్స్!

Published on Jun 16, 2025 8:00 PM IST

టాలీవుడ్‌లో క్లాసిట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘పెదరాయుడు’ కూడా ఒకటి. కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు డ్యుయెల్ రోల్‌లో నటించిన ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. పూర్తి కుటుంబ కథా చిత్రంగా వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు బ్లాక్‌బస్టర్ కలెక్షన్స్ దక్కాయి. 1995 జూన్ 15న రిలీజ్ అయిన ఈ చిత్రం 30 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా నటుడు మోహన్ బాబు ఈ సినిమాలో ‘పాపా రాయుడు’ పాత్రలో నటించిన సూపర్ స్టార్ రజినీకాంత్‌ను కలిశారు. ‘కన్నప్ప’ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రజినీని కలిసిన మోహన్ బాబు ‘పెదరాయుడు’ 30 ఏళ్ల సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. పాపా రాయుడు పాత్రలో రజనీకాంత్ నటించగా, ఆ పాత్రకు తెలుగు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇలా తాము ఇద్దరం కలిసి నటించిన సినిమా 30 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని మోహన్ బాబు, రజినీకాంత్ కేక్ కట్ చేశారు.

ఈ క్రమంలోనే ‘పెదరాయుడుతో పాపా రాయుడు’ అంటూ రజినీకాంత్ చేసిన కామెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. పెదరాయుడు సినిమాలో సౌందర్య, భానుప్రియ కూడా నటించారు. కోటి సంగీతం అందించిన ఈ చిత్ర పాటలు సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు