మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘మాస్ జాతర’ చిత్రంలో బిజీగా ఉన్న ఆయన, రీసెంట్గా దర్శకుడు కిషోర్ తిరుమలతో ఓ సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ చిత్రం రవితేజ కెరీర్లో 76వ చిత్రంగా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తాజాగా ప్రారంభించారు.
ఈ చిత్ర షూటింగ్ కోసం హైదరాబాద్లో ఓ ప్రత్యేక సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సెట్లో సోమవారం నాడు షూటింగ్ మొదలుపెట్టారు. రవితేజతో పాటు సినిమాలోని ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా ముగించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ను అనౌన్స్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.