పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో హరిహర వీరమల్లు మూవీపై ఎలాంటి క్రేజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రానుంది. ఇక ఇటీవల ఈ సినిమా షూటింగ్ను పవన్ ముగించాడు.
అయితే, ఈ సినిమాలో పవన్ నుంచి కొన్ని పొలిటికల్ పంచులు కూడా వినిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కొన్ని పవర్ఫుల్ డైలాగులు పవన్ నోటి నుంచి వినిపించబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో ‘‘డబ్బుల కోసం.. పదవుల కోసం నమ్మిన ధర్మాన్ని మార్చుకునే మనిషిని కాను’’ అనే పవర్ఫుల్ డైలాగ్ ఉండబోతుందని సినీ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి.
పవన్ రియల్ లైఫ్కు చాలా దగ్గరగా ఈ డైలాగ్ ఉండటంతో ప్రేక్షకులను ఇది ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు.