ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ?

ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ?

Published on Jan 31, 2021 3:00 AM IST

ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అలవైకుంఠపురములో’ వంటి హిట్ చిత్రాల తరువాత, త్రివిక్రమ్ తన తర్వాతి చిత్రాన్ని కూడా మళ్లీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ ను బాలీవుడ్ నుండి తీసుకోవాలనే ఆలోచనలో ఉందట చిత్రబృందం. కాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ వారిన హుస్సేన్ ఫిక్స్ చేయనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. వారిన హుస్సేన్ అయితే బాగుంటుందని త్రివిక్రమ్ ఫీల్ అవుతున్నాడట. కానీ, ఇప్పటివరకూ ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ లేదు.

కాగా హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మరో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకోవాలనే యోచనలో ఉన్నారట త్రివిక్రమ్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు