ఎన్టీఆర్, చరణ్ ల పై రాజమౌళి ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

ఎన్టీఆర్, చరణ్ ల పై రాజమౌళి ఇంట్రస్టింగ్ కామెంట్స్ !

Published on Apr 21, 2020 9:00 PM IST

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రాబోతున్న అత్యున్నత భారీ మల్టీస్టారర్ ‘రౌద్రం రణం రుధిరం’. కాగా రాజమౌళి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి, ఇందులో హీరోలుగా చేస్తోన్న తారక్, చరణ్ ల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చేప్పారు.

ఆ విషయాలను డి.వి.వి ఎంటర్ టైన్మెంట్స్ పోస్టర్ రూపంలో రిలీజ్ చేసింది. రాజమౌళి మాటల్లో.. గతంలో తారక్, చరణ్ లతో సూపర్ హిట్ చిత్రాలను చేసానని.. వారి గురించి పూర్తి అవగాహన ఉందని.. ఇద్దరు రియల్ లైఫ్ లో మంచి ఫ్రెండ్స్.. అయితే ఫ్యాన్స్ పరంగా చూస్తే ఇద్దరి హీరోల ఫ్యామిలీస్ మధ్య గట్టి పోటీ ఉంది. అలాంటి రెండు ఫ్యామిలీస్ నుండి వచ్చిన టాప్ హీరోలు కలిసి నటిస్తే బాగుంటుందనే ఐడియా ఎప్పటినుండో తనకు ఉందని… అది ఆర్ఆర్ఆర్ రూపంలో రాబోతుందని రాజమౌళి చెప్పారు.

అలాగే ‘షూట్ కు వెళ్లే ముందే క్యారెక్టరైజేషన్స్ అండ్ క్యారెక్టర్ డిజైన్ సెషన్స్ చేశామని.. ఇద్దరు హీరోలు తన పాత్రల మధ్య అనుబంధాన్ని, నీటికి చేపకి మధ్య ఉండే అనుబంధంలా బాగా అర్ధం చేసుకున్నారని రాజమౌళి తెలిపారు. కాగా రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం విదేశీ నటీనటులు.. ప్రధానమైన విలన్ గా ఐర్లాండ్‌కు చెందిన నటుడు రే స్టీవెన్‌ సన్‌ ను, ఐరిష్ నటి అలిసన్ డూడీని తీసుకున్నారు.

ఇక ఎన్టీఆర్ కి హీరోయిన్ గా ఒలివియా మోరిస్ ను తీసుకున్నారు. మొత్తానికి రాజమౌళి ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నాడు.

https://www.instagram.com/p/B_PXg-npb2v/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు