రీసెంట్ గా ఇండియన్ సినిమా దగ్గర ఒక సర్ప్రైజింగ్ బ్లాక్ బస్టర్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది యానిమేషన్ చిత్రం “మహావతార్ నరసింహ” అని చెప్పాలి. దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన ఈ డివోషనల్ యాక్షన్ డ్రామా లిమిటెడ్ గా రిలీజ్ అయ్యి ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తోంది. వీకెండ్ అయ్యి వీక్ డేస్ లోకి వచ్చిన తర్వాత కూడా సెన్సేషనల్ రన్ ని ఈ సినిమా చూపించడం గమనార్హం.
రిలీజ్ రోజు కేవలం 80 వేలకి పైగా టికెట్స్ ఈ సినిమాకి బుక్ మై షోలో అమ్ముడుపోతే ఇప్పుడు వర్కింగ్ డే నిన్న మంగళవారం ఏకంగా 2 లక్షల 30 వేలకి పైగా టికెట్స్ సేల్ అయ్యాయి. ఇది మొన్న హాలిడే ఆదివారం బుకింగ్స్ కి దగ్గరగా ఉన్నాయి. ఈ లెక్కన మహావతారా నరసింహ సెన్సేషన్ ఏ లెవెల్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ మరియు క్లీం ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.