స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో సినిమా వస్తోందంటేనే.. ఫ్యాన్స్ లో అంచనాలు రెట్టింపు ఆవుతాయి. మరి ఆ అంచనాలను అందుకుంటారా ? మేకర్స్ మాత్రం సినిమా పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. అందుకే ఈ సినిమాకి దాదాపు వంద కోట్లు వరకు బడ్జెట్ వేశారాట. కరోనా తరువాత కూడా బడ్జెట్ లో మార్పు లేకుండా ఖర్చు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ పెడుతున్నారంటే.. సినిమా పై వారికున్న నమ్మకమే.
ఇక నవంబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత తక్కువమంది సభ్యులతో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే సాంగ్స్ కి ఎక్కువ మంది డాన్సర్స్ కావాల్సి రావడం, ఎక్కువ రోజులు షూట్ చేయాల్సి రావడంతో ముందుగా సాంగ్స్ కంటే కూడా.. తక్కువమంది ఆర్టిస్ట్ లు ఉన్న సీన్స్ నే షూట్ చేయాలనుకుంటున్నారు.
ఈ సినిమాకి రష్మిక మందన్న కథానాయిక. బన్నీ సరసన ఎలా ఉంటుందో చూడాలి. దేవీ శ్రీ పుష్ప సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు ట్యూన్స్ కూడా ఇచ్చాడట. మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.