నిఖిల్ సినిమా అంటేనే ఏదోక కొత్త పాయింట్ ఉంటుందనే ముద్రను సంపాదించాడు ఈ యంగ్ హీరో. మొదటి నుండి కమర్షియల్ ఫార్ములాకు దూరంగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ వస్తున్న నిఖిల్.. తన కెరీర్ లోనే క్రేజీ మూవీగా ’18 పేజెస్’ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ తీసుకోబోతున్నారని, ఆ తరువాత అనూ ఇమాన్యుల్ తీసుకోబోతున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని గ్యాంగ్ లీడర్ బ్యూటి ‘ప్రియాంక అరుల్ మోహన్’ను తీసుకోబోతునట్లు తెలుస్తోంది. దాదాపు ‘ప్రియాంక అరుల్ మోహన్ నే ఈ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ చేయనున్నారట. మరి ‘ప్రియాంక అరుల్ మోహన్’ కెరీర్కు ఈ సినిమాతో బ్రేక్ లభిస్తుందేమో చూడాలి.
ఇక ఈ సినిమాలో హీరో పాత్ర మెమరీ లాస్ సమస్యతో సఫర్ అవుతూ ఉంటుందని అయితే ఈ మెమరీ లాస్ అనేది సెకెండ్ హాఫ్ లో మాత్రమే వస్తోందని తెలుస్తోంది. నిఖిల్ హీరోగా సుకుమార్ మరియు అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలలో ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఓ సినిమా రాబోతుంది.