ఇండస్ట్రీ నష్టాలు వేయి కోట్లపైనే

ఇండస్ట్రీ నష్టాలు వేయి కోట్లపైనే

Published on Mar 23, 2020 5:55 PM IST

కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా గత వారం రోజులుగా సినీ పరిశ్రమ పూర్తిగా మూతబడింది. థియేటర్లు సైతం 15వ తేదీ నుండి మూతబడే ఉన్నాయి. పూర్తైన సినిమాల విడుదల వాయిదాపడగా, చిత్రీకరణలో ఉన్న సినిమాలు కూడా ఆగిపోయాయి. దీంతో లాక్ డౌన్ సమయం ముగిసేనాటికి నష్టాలు వేయి కోట్లకు పైనే ఉంటాయని అంటున్నారు బడా నిర్మాతలు.

బాలీవుడ్, టాలీవుడ్, తమిళం ఇలా అన్ని పరిశ్రమల్లో చాలా సినిమాలు విడుదల వాయిదాపడిపోయింది. ఇప్పటికే ఒక శుక్రవారం మిస్సైంది. రానున్న రోజుల్లో ఇంకో ఫ్రైడే కూడా వృధా పోనుంది. ఇలా రెండు వారాలు బిజినెస్ లేకపోవడంతో నష్టాలు భారీగా ఉంటాయని, మిగతా పరిశ్రమలు అయితే లాక్ డౌన్ పీరియడ్ ముగిస్తే డిమాండ్ అండ్ సప్లై ఫార్ములాతో కోలుకునే వీలుంది, కానీ సినీ ఇండస్ట్రీ మాత్రం అలా కాదు. ఎన్ని రోజులు లాక్ డౌన్ ఉంటే అంత నష్టం. మరి ఈ నష్టాల్ని కొంతైనా తగ్గించుకోవడానికి నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలు ఎలాంటి వ్యూహాలు పాటిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు