గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఓ అరుదైన గౌరవాన్ని పొందుతున్నాడు. లండన్లో ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, రామ్ చరణ్కు దక్కనున్న ఈ అరుదైన గౌరవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు మెగా ఫ్యామిలీ లండన్కు పయనం అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ తో పాటు.. రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, కూతురు క్లిన్ కారా లండన్కు పయనం అయ్యారు.
ఆర్ఆర్ఆర్ చిత్రంతో రామ్ చరణ్ స్థాయి గ్లోబల్ స్టార్గా ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.