టాలీవుడ్లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్టుల్లో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న సినిమా కూడా ఒకటి. ఈ సినిమాను ఇటీవల అధికారికంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను అనిల్ రావిపూడి తనదైన మార్క్ ఎంటర్టైనర్గా తీర్చిదిద్దబోతున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ సినీ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ మే 22 నుంచి స్టార్ట్ కాబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం యుకె టూర్లో ఉన్న చిరంజీవి తిరిగి ఇండియాకి రాగానే చిత్ర యూనిట్తో సమావేశం కానున్నాడట. ఆ తర్వాత కొన్ని కీలక సీన్స్తో పాటు ఓ సాంగ్ షూట్తో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో నయనతార, కేథరిన్ త్రేజా హీరోయిన్లుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.