చాలా కాలం గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి ఎంటర్ అవ్వడంతో మళ్ళీ తమకు పాత రోజులు వచ్చేశాయని పవన్ అభిమానులు అభిప్రాయపడ్డారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో పింక్ రీమేక్ గా “వకీల్ సాబ్” ను చాలా సస్పెన్స్ తర్వాత అనౌన్స్ చేసిన కొద్ది లోనే మరిన్ని ప్రాజెక్టులను ఒకదాని తర్వాత మరొకటి ఒకే చేసేసారు.
అలా మొదలు పెట్టిన వాటిలో గబ్బర్ సింగ్ లాంటి భారీ హిట్ ను అందించిన హరీష్ శంకర్ తో కన్ఫర్మ్ అయ్యిన ప్రాజెక్ట్ ఒకటి. ఈ చిత్రం నిన్న మే 11తో 8 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున రచ్చ చేసారు. ఇదిలా ఉండగా ఈ సినిమా హీరోయిన్ ఈమే అంటూ ఓ రూమర్ బయటకు వచ్చింది. కేరళ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ మానస రాధా కృష్ణన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది అని నయా రూమర్ చక్కర్లు కొడుతుంది. అలాగే మరోపక్క ఇందులో ఎలాంటి నిజమూ లేదని మరో వెర్షన్ కూడా వినిపిస్తుంది.