సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “కింగ్డమ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా జూలైలో గ్రాండ్ గా రిలీజ్ కి వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇంకా నెల మాత్రమే సమయం ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో పలు రూమర్స్ ఈ చిత్రంపై మొదలయ్యాయి. గౌతమ్ సినిమా చూసిన తర్వాత చాలా సీన్స్ రీషూట్ చేస్తున్నారని ఇలా మళ్ళీ ఆలస్యం అవుతుంది అన్నట్టు టాక్ వచ్చింది. అయితే అసలు దీనిపై క్లారిటీ తెలిసింది. నిజానికి ఎలాంటి రీషూట్స్ జరగడం లేదట.
సినిమా డేట్ ఇచ్చి దగ్గరకి వస్తున్నప్పటికీ అన్ని సినిమాలకి జరిగే లానే చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ మాత్రమే జరుగుతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. సో కింగ్డమ్ పై ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సితార ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.