ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్ చిత్రాలకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో మనం చూస్తున్నాం. హిట్టు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా ఆడియెన్స్కు కనెక్ట్ అయ్యే సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్స్పై ప్రేక్షకులు చూసేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో పలు చిత్రాలను భారీగా రీ-రిలీజ్ చేస్తూ మేకర్స్ సందడి చేస్తున్నారు. అయితే, తాజాగా ఓ క్లాసిక్ కల్ట్ చిత్రం రీ-రిలీజ్ అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి జంటగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన సోషియో ఫాంటెసీ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అప్పట్లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఈ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ రీ-రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమాను వెండితెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. తొలిరోజు ఈ చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర కళ్లు చెదిరే విధంగా రూ.1.75 ఓపెనింగ్స్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రీ-రిలీజ్లో ఎలాంటి దుమ్ములేపుతుందో చూడాలి.