‘శర్వానంద్’ సినిమా కథ అదేనా ?

‘శర్వానంద్’ సినిమా కథ అదేనా ?

Published on Nov 9, 2025 2:00 AM IST

Sharwanand

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడట. ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. కాగా ఈ సినిమా కథ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ తెలిసింది. తెలియని వయసులో ఆవేశంలో చేసిన ఓ పని కారణంగా హీరో లైఫ్ లో జరిగే డ్రామా చాలా బాగుంటుందట.

ఆలాగే, హీరో జీవితంలో చోటు చేసుకునే సంఘటనలు కూడా చాలా కామెడీగా సాగుతాయని.. సినిమాలో లవ్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటుందని తెలుస్తోంది. శర్వానంద్ కి ఈ కథ చాలా బాగా నచ్చిందట.ఈ ఏడాది చివర్లో వీరిద్దరి కలయికలో సినిమా మొదలు అవుతుందట. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

తాజా వార్తలు