నేషనల్ స్టార్ గా ప్రభాస్ బాలీవుడ్ బడా దర్శకుడు సంజయ్ రౌత్ తో “ఏ- ఆది పురుష్” అనే మరో భారీ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్స్ నటిస్తున్నారు. అయితే, తాజాగా మరో రూమర్ ఒకటి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ‘ఆదిపురుష్’లో మాజీ హీరోయిన్ హేమా మాలిని కూడా ఓ కీలక పాత్రలో నటించబోతుందని తెలుస్తోంది. అయితే హేమా మాలిని గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంటూ వస్తోంది.
ఈ మధ్యలో కొన్ని సినిమాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పాత్ర అయితే ఆ సినిమాలు చేస్తోంది. మరి భారీ స్థాయీలో హాలీవుడ్ సినిమాలకి ఏమాత్రం తీసిపోకుండా రూపొందించబోతున్న ఆదిపురుష్ లో ఓ అత్యంత కీలక పాత్ర ఉందని.. ఆ పాత్రకు హేమా మాలిని అయితేనే న్యాయం జరుగుతుందని.. అందుకే ఆమెను ఆ పాత్ర చేయడానికి ఒప్పించారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రభాస్ బాడీ పెంచనున్నాడు. ఎందుకంటే సినిమాలో ప్రభాస్ ఎనిమిది అడుగుల అజానబాహుడిగా కనిపించబోతున్నాడు.