పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇపుడు నటిస్తున్న అలాగే నటించనున్న చిత్రాలు పలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేయనున్న భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం సలార్ 2 కూడా ఒకటి. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన పార్ట్ 1 థియేటర్స్ లో భారీ వసూళ్లు అందుకుంది. ఆ తర్వాత ఓటిటిలోకి వచ్చాక మరింత రిపీట్స్ అందుకున్న ఈ సినిమా క్రేజ్ ఆఫ్ లైన్ లో కూడా గట్టిగానే ఉంది.
అయితే ఇపుడు సలార్ 2 పై ఓ అప్డేట్ రానున్నట్టుగా ఇపుడు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే సలార్ పార్ట్ 2 కి సంబంధించి మేకర్స్ నుంచి ఓ స్పెషల్ అనౌన్సమెంట్ రానుందట. మరి అదేంటి ఎపుడు అనేది వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ గా కనిపించనున్నాడు. అలాగే హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.