మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ అనే చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఉప్పెన కథ గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఉప్పెన ఓ విషాద వంతమైన ప్రేమ కథ అని, అయితే ప్రేమలో విఫలమైన జంటగా మిగిలినప్పటికీ, హీరోహీరోయిన్లు జీవితంలో ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా ఉంటారని.. సెకెండ్ హాఫ్ లో హీరో పాత్రలో చాల వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.
కాగా ఈ చిత్రాన్ని జూన్ సెకెండ్ వీక్ లో విడుదల చేయాలని మేకర్స్ యోచిస్తున్నారు. అయితే రిలీజ్ డేట్ కి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. వైష్ణవ్ తేజ్ తో పాటు నూతన దర్శకుడు బుచ్చిబాబు సానాను దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతి ఈ మూవీలో హీరోయిన్ కి తండ్రిగా అలాగే విలన్ పాత్రలో కనిపించనున్నాడట. ‘రాక్ స్టార్’ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు.