నేను ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను : పూరి

నేను ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను : పూరి

Published on Oct 18, 2012 3:26 AM IST


ప్రస్తుతం సినీ ప్రేమికుల దృష్టి మొత్తం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మీదే ఉంది మరియు అతను తీసిన ‘కెమెరామెన్ గంగతో’ రాంబాబు’ సినిమా మీద ఉంది. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండస్ట్రీలో తన డైరెక్షన్ కి ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్నారు. పూరి తను ఎప్పుడూ ప్రత్యేకంగా ఉండాలనుకుంటాను అని అంటున్నారు, బహుశా పూరి జాకీ చాన్ ని స్ఫూర్తి గా తీసుకున్నట్టు ఉన్నారు. చాలా కాలం క్రితం కొంత మంది జాకీ చాన్ ని ‘మీరు సెకండ్ బ్రూస్ లీ అవ్వాలనుకుంటున్నారా?’ అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘ నేను మొదటి జాకీ చాన్ గా ఉండాలనుకుంటున్నాను’ అని అన్నారు. పూరి కూడా ఇదే ప్రశ్నకు కొంచెం అలాంటి సమాధానాన్నే ఇచ్చారు ‘ నేనెందుకు వేరొకరిలా ఉండాలి? నేను చేసే పనిలో వేరే వారి పోలిక ఎందుకు ఉండాలి? వేరే వారు చూపిన దారిలో నేనెందుకు నడవాలి? అని పూరి అన్నారు. ఆయన అన్నట్లుగానే పూరి జగన్నాథ్ తనకంటూ ఓ స్పెషాలిటీ ని ఏర్పరుచుకున్నారు. ‘బద్రి’ సినిమాతో డైరెక్టర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన పూరి 25 సినిమాల మైలురాయిని తక్కువ టైంలోనే చేరుకున్నారు. అతని సినిమాల్లో హీరోయిజం, చాలా ఫాస్ట్ గా సినిమా ముందు కెళ్ళడం మరియు చాలా ఎంటర్టైనింగ్ గా ఉండటం చాలా బాగుంటాయి. అలాంటి పూరి తను తీసిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాతో ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగ రాస్తాడా? లేదా? అనే దానికోసం మరికొన్ని గంటలు వేచి చూడాలి?

తాజా వార్తలు